*భద్రాద్రిలో ఘనంగా శ్రీరాముడు బ్రహ్మోత్సవాలు
*పట్టువస్ర్తాలు సమర్పించిన గవర్నర్ తమిళిసై
*స్వామివారి ఆశ్సీలు నాకు ఉన్నాయి..
*సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది..
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ జరుగుతున్న వేడుకలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జగదభిరాముని పట్టాభిషేక మహోత్సవంలో సీతారాముల స్వామివారిని గవర్నర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తమిళిసై దంపతులకు అర్చకులు వేదఆశీర్వచనాలు అందించారు.
అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. భక్త రామదాసు నిర్మించిన ఆలయాన్ని, భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు.