telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పెళ్లికి వెళ్లిన ఫ్యామిలీ పై కేసు… ఎందుకంటే..?

హైదరాబాద్ కు చెందిన ఒక ఫ్యామిలీ నెల్లూరుకి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి నెల్లూరు వరకు వెళ్లారు. అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తమ హెలికాప్టర్ ల్యాండింగ్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ ల్యాండింగ్ కావడం ఇప్పుడు వివాదాస్పదమైంది. తన బంధువుల పెళ్లి కోసం సకుటుంబ సపరివారంగా హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారవేత్త ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు వెళ్ళాడు.

నెల్లూరు లోని అనంతసాగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. కుటుంబసభ్యులతో కలిసి హెలికాప్టర్లు దిగి అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.. వివాహానికి హాజరైన తర్వాత తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్న రెవెన్యూ తో పాటు విద్యాశాఖ అధికారులు వెంటనే హెలికాప్టర్ ల్యాండింగ్ విషయాన్ని గుర్తించారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ ల్యాండింగ్ ,టేకప్ చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హెలికాప్టర్ సంస్థ అన్ని అనుమతులు తీసుకున్నాకే తమను హైదరాబాద్ నుంచి నెల్లూరు కు తీసుకొని వచ్చి వెళ్లిందని సదరు వ్యాపారవేత్త చెప్తున్నాడు

Related posts