లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వెనుకున్నది కోడికత్తి పార్టీనే అని టీడీపీ మహిళా నేత దివ్య వాణి విమర్శించారు. ఈ నెలాఖరున రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినీమా విడుదలను అడ్డుకోవడానికి టీడీపీ నేతల శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై టీడీపీ నేతలు, నటి దివ్యవాణి, దేవీబాబు, బ్రహ్మంచౌదరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ ఈసీ కోరిన ధృవ పత్రాలను అందజేస్తామన్నారు. దర్శకుడు రాంగోపాల్వర్మ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి విషపుచుక్కని దివ్యవాణి దుయ్యబట్టారు.