telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాటిన మొక్కను కాపాడే బాధ్యత తీసుకోవాలి: హరీశ్‌ రావు

harish rao trs

నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత తీసుకోవాలని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు సూచించారు. సిద్దిపేట సుడా కార్యాలయం ముందు సుడా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్‌రావు విచ్చేశారు.

ఈ సందర్భంగా శార్వరీ గ్రీన్‌ పార్కును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ ఆకుపచ్చ తెలంగాణగా మార్చుతున్నారన్నారు. ప్రతి ఒక్కరం ఒక్కో మొక్క నాటి కేసీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో జరిగే శుభకార్యాల్లో రిటర్న్‌ గిఫ్ట్‌గా మొక్కలు ఇద్దామని హరీశ్‌ రావు అన్నారు.

Related posts