తెలంగాణలో కరోనా వైరస్ అన్నీ రంగాలవారిని టచ్ చేస్తోంది. వివిధ శాఖల ఉద్యోగులతో పాటు కీలక నేతలందరూ వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా నిజామాబాద్ మాజీ ఎంపీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్లోకి వెళ్లారు.
ఆమె డ్రైవర్కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు కవిత సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో 50 వేల మార్కును దాటేసింది. అలాగే, ఇప్పటి వరకు 447 మంది ప్రాణాలు కోల్పోయారు.