telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

పెళ్ళాంతో పాటుగా ప్రియురాలితో కూడా .. ఉండొచ్చు .. : కోర్టు

register marriages at their home only

సాధారణంగా వివాహం చేసుకుని భార్య ఉండి కూడా మరొక మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధమనే విషయం తెల్సిందే. అయితే పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన యువతి, అతనితో కలిసి ఉండవచ్చు అంటూ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఓ కేసు విచారణలో భాగంగా రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు సందీప్‌ మెహతా, వినిత్‌ కుమార్‌ మథూర్‌లు ఈ మేరకు సంచలన తీర్పునిచ్చారు. మొయినుద్దీన్ అనే వ్యక్తికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పాల్ సోనీ అనే 26 ఏళ్ల యువతి అతడిని ప్రేమించింది.

భార్యాపిల్లలు ఉన్న ఏ వ్యక్తితోనూ పెళ్లి చేయడానికి ఏ యువతి తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఈ క్రమంలో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీనితో మొయినుద్దీన్ మరియు సోనీలు ఇంటర్ ఫెయిత్ (నమ్మకం) వివాహం చేసుకున్నారు. అలాగే ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇది తెలుసుకున్న సోనీ తల్లిదండ్రులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. మొయినుద్దీన్ ఆమె కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేశాడు.

పోలీసులు సోనీని ఇచ్చిన గడువు లోగా కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఆమె భవిష్యత్తు, తదనంతర పరిణామాలను గురించి సోనీకి కౌన్సిలింగ్‌ని ఇప్పించినప్పటికీ, ఆమె మొయినుద్దీన్‌తోనే ఉంటానని తేల్చి చెప్పింది. సోనీ మేజర్ కావడంతో ఆమెను మానసిక పరిపక్వత గల యువతిగా భావించిన న్యాయమూర్తులు సోనీ- మొయినుద్దీన్ కలిసి ఉండేలా సంచలన తీర్పునిచ్చారు.

Related posts