telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం.. 50 లక్షలు దాటిన కేసుల సంఖ్య!

Corona

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలకు పాకడంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది.

గత 24 గంటల్లో దేశంలో 90,123 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది. ఇదే సమయంలో 1,290 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

దీంతో మృతుల సంఖ్య మొత్తం 82,066కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 39,42,361 మంది కోలుకున్నారు. 9,95,933 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు మొత్తం 5,94,29,115 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

Related posts