సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తన పేరిట ప్రచారం అవుతోన్న ఓ లేఖ తనది కానప్పటికీ, అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం మాత్రం నిజమేనని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యం గురించి సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు. “ప్రియమైన రజనీకాంత్ సర్. మాకు మీ ఆరోగ్యం, సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదు. మీరు మా మేలిమి వజ్రంలాంటి వారు. మీరు మా నిధి. ఆరోగ్య పరంగా, ఇతర విషయాల పరంగా ఏది చేస్తే మీకు మంచి జరుగుతుందో అదే చేయండి. మీపై మాకు ఉన్న ప్రేమను ఏ విషయమూ తగ్గించలేదు. మా జీవితాంతం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము” అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ఇక రజినీకాంత్ ఆరోగ్యం బాగుండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Dear @rajinikanth Sir. Nothing is more important than your good health and happiness. You are our precious gem. You are our treasure. Pls do what you is best for you, health wise and otherwise. Nothing will change our love for you. We will continue to idolize you all our lives ❤
— KhushbuSundar ❤️ (@khushsundar) October 30, 2020