telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పీలేరు వైసీపీ అభ్యర్థి చింతల నామినేషన్ పై టెన్షన్ !

YCP padma comments Chandrababu

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సోమవారం ముగియడంతో మంగళ వారం నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్ల పరీశీలన చేపట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ ఇంకా పెండింగ్ లో ఉండటమే దానికి కారణం.

నామినేషన్ పత్రాలతో పాట నో డ్యూస్ సర్టిఫికెట్లను ఇవ్వని కారణంగా నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి పెండింగ్ లో ఉంచారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నో డ్యూస్ సర్టిఫికెట్స్ పై ప్రత్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్నికల అధికారికి తాను వివరణ ఇచ్చానని పేర్కొన్నారు. పీలేరు స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

Related posts