తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ వద్ద కలకలం చోటు చేసుకుంది. ఓ భార్యా బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతనిపై నీళ్లు గుమ్మరించి అడ్డుకున్నారు. తన భార్య నిత్యం తనతో గొడవపడుతోందని, ఆమె వేధింపులను భరించలేకపోతున్నానంటూ బాధితుడు అచ్చయ్య వాపోయాడు.
సోమాజిగూడలో మంజీరా గెస్ట్ హౌస్ కు సమీపంలో నివాసం ఉంటున్న 35 ఏళ్ల అచ్చయ్య తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. తనకు ఆరుగురు సంతానమని, వారిని పోషించడం కష్టంగా ఉందని పోలీసుల విచారణలో అచ్చయ్య తెలిపాడు. దీనికి తోడు తన భార్య మరియమ్మ నిత్యం తనను తిడుతూ, వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వీటన్నింటిని భరించలేక, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు.
వెయ్యి కోట్లు ఇచ్చినా.. అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవి ఇవ్వదు: జగ్గారెడ్డి