కరోనా సెకండ్ వేవ్ మన దేశంలోని అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ సెకండ్ వేవ్ ఎక్కువగా యూత్ పై ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న నేపథ్యంలో దేశంలో థర్డ్ వేవ్ కూడా త్వరలోనే ఎంటర్ కానుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ తరుణంలో థర్డ్ వేవ్ కరోనాను ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతోంది. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అలర్ట్ అయింది. ఇందులో భాగంగానే పిడీయాట్రిక్ కోవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏపీఎంఎస్ఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. మూడో దశలో చిన్న పిల్లలకు కోవిడ్ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. కోవిడ్ ప్రొటోకాల్స్ ఏ విధంగా ఉండాలనే అంశాలపై అధ్యయనం చేయనుంది టాస్క్ఫోర్స్. చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన కరోనా చికిత్సపై వైద్యారోగ్య సిబ్బందికి శిక్షణపై నివేదిక ఇవ్వనుంది. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ కమిటీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
previous post
next post
సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ