టీడీపీ నేత అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అచ్చేన్న అరెస్ట్ ను ఖండించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయనను అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కుట్రేనని చెప్పారు. టీడీఎల్పీ ఉపనేతగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఆయన ఎండగడుతున్నారని, అందుకే ఆయానను అరెస్ట్ చేశారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు వచ్చాయని అన్నారు. దీంతో, కుంభకోణంపై విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారని సోమిరెడ్డి చెప్పారు. ఏపీలో మాత్రం ఎలాంటి శాఖాపరమైన విచారణ లేకుండానే, అచ్చెన్నను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇది రాజకీయ కుట్రేనని ఆరోపించారు.
ఫెలైన విద్యార్థి ఏడ్చినట్టుంది చంద్రబాబు ఎడుస్తున్నాడు !