telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇళ్ల స్థలాల పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: కళా వెంకట్రావు

kalavenkat rao tdp

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పథకం వైసీపీ నేతలకు ఆర్థిక ఫలాల పథకంగా మారిందన్నారు.రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన వారిని బెదిరించి, వారి నుంచి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు.

రూ.లక్షల విలువచేసే భూములను కోట్ల రూపాయల విలువ చేసే భూములుగా చూపించి వైసీపీ నేతలు దోచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ప్రతి నియోజక వర్గంలో వైసీపీ నేతలు రూ.10 కోట్ల చొప్పున దోచుకున్నారని ఆరోపించారు.

Related posts