ఈ నెల 29వ తేదీ నుంచి మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లో జనసేన పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పేర్కొన్నారు.
పార్టీ నిర్మాణంలో భాగంగా క్రియాశీలక కార్యకర్తలు, ముఖ్య నేతలతో చర్చిస్తారని అన్నారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టే కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖాముఖీ చర్చలు ఉంటాయని, 29వ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో పవన్ కల్యాణ్ చర్చిస్తారని, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరుగుతుందని అన్నారు.