సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జల నిపుణుడు ఆర్.విద్యాసాగర్రావు సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం విద్యాసాగర్రావు వర్ధింతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు.
విద్యాసాగర్రావు ఆశ యాల మేరకు ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా అహరహం శ్రమిస్తున్నదని అన్నారు. తెలంగాణ ఇంజనీర్లు విద్యాసాగర్ రావు ఇచ్చిన స్పూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. రైస్బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిన తెలంగాణ రాష్ట్రమే విద్యాసాగర్రావుకు నిజమైన నివాళి అని సీఎం పేర్కొన్నారు.