ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సీఎం జగన్ ను ప్రశంసించారు. జగన్ ముస్లింలకు అల్లా, ఎస్సీలకు అంబేడ్కర్, క్రిస్టియన్లకు జీసస్ లాంటివాడని అభివర్ణించారు. దీనిపై టీడీపీ మైనారిటీ విభాగం నేత ఫతావుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్లాతో ఎవరినీ పోల్చకూడదని ఖురాన్ చెబుతోందని, కానీ, జగన్ ను అల్లాతో పోల్చుతూ మంత్రి జయరాం వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
ఈ వ్యవహారం పై మంత్రి జయరాం తాజాగా స్పందించారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ ద్వారా ఇచ్చే పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50 శాతం వాటా కల్పించినందునే జగన్ దేవుడి లాంటి వ్యక్తి అని చెప్పానే తప్ప, తనకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ముస్లిం మైనారిటీలకు బాధ కలిగిస్తే వాటిని తక్షణమే ఉపసంహరించుకుంటున్నానని వెల్లడించారు.
శ్రీమంత్ పాటిల్ లేఖపై అనుమానాలు వ్యక్తం చేసిన కర్ణాటక స్పీకర్