కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద్ సభలో భాగంగా ఆయన శనివారం హైదరాబాద్లోని అంబర్పేటకు చేరుకున్నారు.. ఈ సందర్భంగా ప్రసంగించిన కిషన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ”ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్పేట ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే. కేంద్రమంత్రి అయినందుకు నాకు సంతోషం లేదు.. అంబర్పేటకు దూరమయ్యానన్న బాధ ఉంది. అంబర్పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని అన్నారు. అంబర్పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పనిచేస్తా. అంబర్పేట నాకు తల్లిలాంటిది. జీవం పోసింది. పార్టీ.. అంబర్పేట నాకు రెండు కళ్లతో సమానం” అన్నారు.
”దేశంలో కరోనా నుంచి కాపాడేందుకు 57కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాం. 130 కోట్ల మందికి రెండు డోసులూ చివరి వ్యక్తి వరకు ఉచితంగా టీకా అందిస్తాం. ప్రజల ప్రాణాల్ని కాపాడతాం. పేద ప్రజలు కొవిడ్తో ఇబ్బంది పడకూడదని గతేడాది ఏప్రిల్ నుంచి దేశంలోని 80కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. వచ్చే దీపావళి వరకు ఇస్తాం.. ఇంకా అవసరమైతే దాన్ని మరింత కాలం పొడిగిస్తాం” అని పేర్కొన్నారు. అందరూ మాస్క్ పెట్టుకోండి. ఏడాదిన్నర నుంచి నేను ఇంట్లో తప్ప మాస్క్ తీయలేదు. గాంధీ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల వార్డుకు తొమ్మిదిసార్లు వెళ్లాను. మాస్క్ పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్నా గనకే కరోనా నన్నేమీ చేయలేదు. నేను కరోనాని జయించాను. రాష్ట్రంలో ఎన్నో ఆస్పత్రులు తిరిగా.. రోగులను కలిశా.. మందులు తీసుకొచ్చా.. ఆక్సిజన్ తెచ్చా.. ఆక్సిజన్ ప్లాంట్ తీసుకొచ్చా. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాం. మాస్క్లు పెట్టుకోండి. ఎవరికేం కాదు. మాస్క్లు పెట్టుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండండి” అని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ: విజయసాయిరెడ్డి