టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెనాయుడును ఈ రోజు ఏసీబీ అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. తప్పుచేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడి పాత్రపై సరైన ఆధారాలు ఉంటే విచారణ జరగాల్సిందేనని అన్నారు.పక్కా ఆధారాలు ఉన్నప్పుడు ఇలాంటి అరెస్టులను ఎవరూ తప్పుబట్టబోరని స్పష్టం చేశారు.
అవినీతి ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యంలో తక్షణ అవసరమని ఉద్ఘాటించారు. గతంలో వైసీపీ అధికారంలో లేనప్పుడు ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అంటూ ఓ పెద్ద పుస్తకం వేశారని తెలిపారు. అయితే అందులోని అంశాలపై ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. ఆ పుస్తకంలో జీవోలతో సహా అవినీతి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడదే వైసీపీ అధికారంలో ఉందని, చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్యాకేజీల కోసమే టీడీపీ నేతలపై రోజా వ్యాఖ్యలు: పంచుమర్తి అనురాధ