మమ్మల్ని గెలిపించని వాళ్లు కూడా మావాళ్లే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శనివారం కేరళ త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం గురువాయూర్లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయినా మోదీ ఎందుకు ఇక్కడ మొదటి రాజకీయ ప్రసంగం చేస్తున్నారని మీరు అడగవచ్చన్నారు.
నిజానికి వారణాసి ఎంతో కేరళ కూడా మాకు అంతే అని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎన్నికలు వరకేనని, దేశంలోని యావన్మందీ ప్రజల బాగోగులు చూడటం ప్రభుత్వం బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామిక పర్వదిన స్ఫూర్తిని కొనసాగించడంపై ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజలందరి సేవకుడినని, గెలుపోటములకు అతీతంగా అందరి సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని మోదీ పేర్కొన్నారు.