telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆ లేఖ ఎవరు సృష్టించినా కేసులు ఎదుర్కోవాల్సిందే: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబయినా, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అయినా సరే ఎవరూ ఈ వ్యవహారం నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.

‘నిమ్మగడ్డ రాసినట్టు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు. అందులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయని ఆయన అన్నారు.

Related posts