telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు కరోనా కొత్త వేరియంట్‌ లా మారుతున్నాడు

vijayasaireddy ycp

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. కరోనా వైరస్ లాగానే చంద్రబాబు.. రోజుకో వేరియంట్ గా మారుతున్నాడని ఎద్దేవా చేశారు. “కరోనా వైరస్ లాగానే చంద్రబాబు రోజుకో తీరు మారుతున్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు కొత్త వేరియంట్‌ లా మారుతున్నాడు. బాబూ, నీది మీటర్ గేజ్ పై తిరిగే రైలు. ఈ రెండేళ్లలో రాష్ట్రమంతా గేజి మార్పిడి జరిగి బ్రాడ్ గేజ్ అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ పట్టాల మీదే తిప్పుతా అంటే రైలు అక్కడే కూరుకుపోతుంది. దానిని అలా వదిలేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు ప్రజలు. వ్యర్థ తాపత్రయాలు మానుకో. బాబు ఒక వాస్తవాన్ని కావాలనే మర్చిపోయినట్టు నటిస్తున్నాడు. తన అక్రమాలకు దన్నుగా నిల్చిన వారిని కాపాడుకోవడానికి, పెంచి పోషించిన వ్యవస్థలను ఇప్పటికీ మ్యానేజ్ చేస్తూ ఉండవచ్చు. కానీ అధికారం రావాలంటే ఈ వ్యవస్థలు, రోజుకు కోటి ఫీజు తీసుకునే లాయర్ల సాయం సరిపోదు. ప్రజలు కోరుకోవాలి. గతంలో పోలింగ్ బూత్ వారీగా కమిటీలున్న పార్టీ తమదొక్కటే అని గొప్పలకు పోయాడు బాబు. అయినా వరస ఎన్నికల్లో చిత్తయ్యాడు. ఇప్పుడు 50 ఇళ్లకో కార్యకర్తను నియమిస్తాడట. జన్మభూమి ముసుగులో పచ్చ బ్యాచ్ సాగించిన అరాచకాలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Related posts