హైదరాబాద్లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు, ఈ నెల 22న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమకు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. 9, 10 షెడ్యూల్లోని సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో ఎక్కువ మంది కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలోని ఓటర్లు కావడంతో సెలవు కావాలని కోరుతున్నారు.
అదే రోజున తెలంగాణలోని మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతిలో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా సెలవు కోరుతుండటం విశేషం.
పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో జగన్ ఒకటైనా నెరవేర్చారా?: అచ్చెన్నాయుడు