telugu navyamedia
తెలంగాణ వార్తలు

హుజూరాబాద్ రిజ‌ల్ట్‌పై కాంగ్రెస్ ఆత్మ‌వ‌లోక‌నం ..

తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాలు, తాజా ప‌రిణామాలు, ప‌రిస్థితుల‌పై ఏఐసీసీ స‌మీక్ష నిర్వ‌హించింది. తెలంగాణ నుంచి ముఖ్య నేత‌లను పిలిపించిన ఢిల్లీ పెద్ద‌లు, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ మనుగ‌డ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై ముఖ్య‌నేత‌ల‌పై గ‌రం గ‌రంగా చ‌ర్చ‌లు జ‌రిపారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మిపై ఇప్ప‌టికే బాధ్య‌త వ‌హించిన రేవంత్‌రెడ్డి, రాబోయే రోజుల్లో ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి ఎలాంటి దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు రేవంత్‌రెడ్డి హైక‌మాండ్‌కు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అంతేకాకుండా క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఇంకా ఇత‌ర అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు.

ఈ సమావేశానికి టి కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసిసి కార్యదర్శులు బోసురాజు,శ్రీనివాసన్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, షబ్బీర్‌అలీ, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌,వి.హనుమంతరావు, సీతక్క త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Related posts