telugu navyamedia
తెలంగాణ వార్తలు

బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఆపాల‌ని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేసుకోవచ్చని ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జి అనుమతించారు. అందుకోసం పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను సింగిల్ జడ్జి సస్పెండ్ చేశారు.పోలీసుల నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. 

అయితే, ఈ సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను ప్రభుత్వం సవాల్ చేస్తూ లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్ పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ అప్పీలుపై మధ్యాహ్నం 1.15 విచారణ చేపట్టేందుకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అంగీకరించింది.

Related posts