telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీసీ నేత ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు..

వైసీపీ రాజ్యసభ అభ్యర్థి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై  నాన్​బెయిలబుల్​ కేసు నమోదైంది.

హైద‌రాబాద్ ప‌రిధిలోని త‌న భూమిని ఆర్.కృష్ణ‌య్య క‌బ్జా చేశార‌ని రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఆరోపిస్తూ.. కోర్టులో పిటిషన్​ వేశారు.  త‌న భూమిని కబ్జా చేయ‌డంతో పాటుగా త‌న‌ను చంపేందుకు కూడా కృష్ణ‌య్య య‌త్నించారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు రౌడీల‌ను పంపి త‌న‌ను బెదిరిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఆర్.కృష్ణ‌య్య‌పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల‌తో.. హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం పోలీస్​స్టేష‌న్‌లో ఆర్‌.కృష్ణ‌య్య‌తో పాటు మ‌రికొంద‌రిపై నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదయ్యాయి. ఈ మేర‌కు ఐపీసీ సెక్ష‌న్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

కాగా..ఏపీ కోటా నుంచి వైసీపీ రాజ్యస‌భ అభ్యర్థిగా ఇటీవ‌లే ఆర్.కృష్ణయ్య నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు శుక్రవారంతో గ‌డువు ముగియ‌నుంది. మొత్తం 4 స్థానాల‌కు 4 నామినేష‌న్లే వ‌చ్చిన నేప‌థ్యంలో శుక్రవారం ఆర్.కృష్ణయ్య స‌హా వైసీపీ అభ్యర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రక‌టించే అవ‌కాశాలున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిల‌బుల్ సెక్షన్ల కింద కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

Related posts