అతివేగంతో అదుపుతప్పిన కారు నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు హైదరాబాద్ వాసులు గల్లంతయ్యారు. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం (ఏపీ31 బిపి 338) అదుపుతప్పి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కి దూసుకెళ్లింది.
వివరాల్లోకెళ్తే.. ఈసీఐల్ అంకుర్ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్ వివాహానికి శుక్రవారం ఉదయం రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. సాగర్ లోకి దూసుకెళ్లిన కారు, ప్రయాణీకులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారంతా ఈసీఐఎల్లోని అంకుర ఆస్పత్రి ఉద్యోగులు అని తెలిసింది. గల్లంతయినవారి కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.