telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చిరంజీవి పొలిటికల్‌ రీ ఎంట్రీపై నాగబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

జనసేన పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి పవన్ కల్యాణ్ మాత్రమే పోటీ చేస్తారని ఇంకెవరూ పోటీ చేయరని స్పష్టం చేశారు..తాను పూర్తిగా పార్టీ సేవకే అంకితమవుతానన్నారు.

ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ..చిరంజీవి మద్దతు పూర్తి స్థాయిలో జనసేనకే ఉంటుంది కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో లేరని.. ఆయన పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారని , ఆయన్ని రమ్నని కూడా కోరమని నాగబాబు వెల్ల‌డించారు.

పొత్తులపై అన్నీ ఆలోచించి పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్టు వివరించారు.

2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభా స్థానం నుంచి నాగబాబు పోటీ ఓడిపోయారు. ఆ త‌రువాత‌ జనసేన తరపున పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇటీవలి కాలంలో చొరవ తీసుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ పాదయాత్రతో సమానమైన యాత్రను చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని నాగ‌బాబు తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఆయన తరపున పార్టీ బాధ్యతలు తీసుకుని పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 

Related posts