జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్ధి నాగబాబు ప్రత్యర్థి పార్టీల నేతలను ఉద్దేశిస్తూ అసభ్యపదజాలంతో వారిని దూషించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమావేశంలో పాల్గొన్న జనసేన నేతలంతా పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇదే కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ ”నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వాళ్లు పనికిమాలిన సన్నాసులు, అడ్డగాడిదలు, వెధవలు… విపక్ష పార్టీల తరఫున ప్రచారం చేసిన నటులంతా పెయిడ్ ఆర్టిస్ట్ గాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయాలను మార్చేస్తామంటున్న జనసేన సిద్ధాంతం ఇలా బూతులు తిట్టడమేనా..? అంటూ మండిపడుతున్నారు రాజకీయ నేతలు. నాగబాబు చేసిన వ్యాఖ్యలను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తున్నారు.
previous post