telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అనకాపల్లి అచ్యుతాపురంలో గ్యాస్ లీక్..మహిళలకు అస్వస్థత

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని పొరస్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకైంది. క్వాంటం, సీడ్స్‌ యూనిట్‌లోకి ఒక్కసారిగా ఘాటైన వాయువు లీక‌వ‌డంతో ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు . 

దీంతో వాంతులు, తల తిరుగుడుతో తీవ్రంగా ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. అస్వస్థతకు గురైన వారందరూ మహిళలే. విషయవాయువు ధాటికి ఎక్కడివాళ్లక్కడే కుప్పకూలిపోయారు. 

నలుగురు మహిళలకు బ్రాండిక్స్ ఆరోగ్య కేంద్రంంలో చికిత్స అందించారు. మరికొందరు కూడా అస్వస్థతకు గురయ్యారని.. వారిని ఆస్పత్రులకు తరలించామంటున్నారు. అయితే ఈ వాయువు ఎక్కడినుంచి వస్తుందో తెలియలేదని యాజమాన్యం చెబుతోంది. 

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రవి సుభాష్.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అదికారులు విచారణ జరుపుతున్నారు.

కాగా.. అమ్మోనియా గ్యాస్‌ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు వెల్లడించారు. గ్యాస్‌ లీక్‌ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు.

Related posts