తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. నిన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. తాజాగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. ఆయనకు వైరస్ సోకగానే, హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు కరోనా బారిన పడి కోలుకున్నారు. కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణించిన సంగతి తెలిసిందే.