నిబంధనలకు విరుద్దంగా కీర్తికుమార్జైన్ కరెన్సీని చెలామణి చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గోషామహల్కు చెందిన కీర్తికుమార్జైన్ నుంచి రూ.2.93 కోట్లు విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అమెరికా, దుబాయ్, సౌదీ, యూరప్ కరెన్సీగా అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా కీర్తికుమార్జైన్ కరెన్సీని చెలామణి చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న కుమార్జైన్ను విచారిస్తున్నారు. ఆయన వెనుక ఎంతమంది ఈ వ్యవహారం నడిపిస్తున్నారనే కోణం పై పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.
previous post