నీటిపారుదల రంగ నిపుణుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఆర్.విద్యాసాగర్రావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఇంజనీర్ల డే నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు.
తెలంగాణ విశ్రాం త ఇంజినీర్ల సంఘం, హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఈ వేడుకలను రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరు కానున్నారు. తొలుత జలసౌధలో విశ్రాంత ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్రావు విగ్రహానికి పలువురు అధికారులు నివాళులర్పిస్తారు.
అనంతరం సాగునీటి రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఇంజినీర్లకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కుమార్ అవార్డులు అందజేస్తారు.
ఈ అవార్డులను జగిత్యాల చీఫ్ ఇంజినీర్ కే సుధాకర్రెడ్డి, ఇంటర్స్టేట్ వాటర్ రిసోర్స్ విభాగం సీఈ కోటేశ్వర్రావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీఈఈ ఎం నీలిమ ఉత్తమ ఇంజినీర్ అవార్డులు అందుకోనున్నారు.