ఢిల్లీ…ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పోరుబాటలో నడవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 14 నుంచి ప్రజా చైతన్యయాత్రలు, పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది.
తెలంగాణలో మండలి ఎన్నికల కారణంగా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రజా చైతన్య యాత్రలకు గానీ, పాదయాత్రలకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్రెడ్డి ప్రజాచైతన్యయాత్రలు, పాదయాత్రల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
అయితే, ఈ కార్యక్రమాలను ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిపే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
తన జీవితం ప్రజలకే అంకితం: కవిత