భూ దోపిడీ దొంగలను కాపాడడంలో మాజీ సీఎం చంద్రబాబు, తాజా సీఎం జగన్ మోహన్ రెడ్డి దొందూ దొందేనని సీపీఐ సీనియర్ నాయకుడు కె.నారాయణ విమర్శించారు. రాజధాని రైతులు నిరసన దీక్షలపై ఆయన స్పందించారు. రాజధాని భూములు ప్రభుత్వాలకు సొంత ఆర్థిక ప్రయోజనాలకు వేదికగా మారిందన్నారు.
రాజధాని పేరుతో చంద్రబాబు వేల ఎకరాలు సేకరిస్తే, జగన్ ప్రభుత్వం ఆ భూములను సెజ్ ల పేరుతో పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాజధానిని మార్చాలని జగన్ అనుకుంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, ప్రజాతీర్పు కోరాలని సూచిం చారు. ఇక, కేంద్ర ప్రభుత్వం అమలు చేయతల పెట్టినఎన్సీఆర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలని దుయ్యబట్టారు.
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కేసీఆర్కు బుద్ధి చెబుతాం: ఉత్తమ్