రాజకీయాల కోసం నిర్వాసితులను రెచ్చగొట్టడం మానుకోవాలని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్పై గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పుపై ఆయన స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా విపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. నిర్వాసితులకు ఎక్కడా లేని విధంగా పరిహారం ఇస్తున్నామని ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. వాదనలు విన్న అనంతరం.. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పనులపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు హైకోర్టు సూచించింది.అందుబాటులో లేని నిర్వాసితులకు వారి లాయర్లకు పరిహారం అందజేయాలని తెలిపింది.
ఆరోపణలు చేసే వారు ఆధారాలతో మాట్లాడాలి: కోడెల