telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అయ్య ఇచ్చిన పదవితో విర్రవీగుతున్నారు.. కేటీఆర్ పై ఉత్తమ్ ఫైర్

uttam congress mp

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ ఓ బచ్చా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అయ్య ఇచ్చిన పదవితో విర్రవీగుతున్నారని అన్నారు. హూజూర్ నగర్ లో ఏం చేశారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పే ఎన్నిక అని చెప్పారు.

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ దే గెలుపని చెప్పుకుంటున్న కేటీఆర్.. కాంగ్రెస్ నేతలను ఎందుకు కొంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో చేరాలంటూ కాంగ్రెస్ నేతలతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. గుత్త పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. డబ్బు, మద్యం, అధికారంతో టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేస్తోందని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు.

Related posts