ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వ విధానాల పై టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేసే వారు ఆధారాలతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. రాజధాని, పోలవరం పనుల్లో అవినీతి జరిగిందనేది అవాస్తవమన్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమం మసకబారిందని హోదా గురించి మాట్లాడడం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు కట్టుబడి ఉన్నామన్న వారే ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని కోడెల ప్రశ్నించారు. ఇసుక విధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకు టీడీపీ సంపూర్ణ మద్దతిస్తుందని కోడెల చెప్పారు.