కరోనాను జయించిన వారు ప్లాస్మా దానానికి దాతలు ముందుకు రావాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తిచేశారు. ప్లాస్మాదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపారు. ‘డొనేట్ ప్లాస్మా- సేవ్ లైఫ్’ అన్న నినాదంతో సత్తూర్ శిరీష ఆమె స్నేహితులు రూపొందించిన వాల్పోస్టర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పై అవగాహనా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా పై అవగహన పెంచుకోవాలని ఈసందర్భంగా సూచించారు. కరోనా నియంత్రణకు నివారణ ఒక్కటే మార్గమని అన్నారు. పీపీఈ కిట్లు ధరించడం వల్ల ఎలాంటి వైరస్ వ్యాపించదని తెలిపారు.