telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో అరడజను సినిమాలు

Tollywood

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘క్రాక్’ సినిమాతో రవితేజ, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో అక్కినేని అఖిల్, ‘రెడ్’ చిత్రంతో రామ్, ‘సోలో బ్రతుకే సో బెటరు’తో సాయి తేజ్, ‘అరణ్య’తో రానా, ‘రంగ్ దే’ చిత్రంతో నితిన్ పోటీపడనున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, ‘కెజీఎఫ్ 2’ లాంటి భారీ చిత్రాలు కూడా సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేసే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా విడుదల కాకుండా ఆగిపోయిన తెలుగు సినిమాలు చాలా వరకు సంక్రాంతి పండుగకు ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. పండుగ సీజన్లో థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్వపు పరిస్థితులు మళ్లీ వస్తాయనే ఆశతో హీరోలు, దర్శక నిర్మాతలు కొంచెం ఆలస్యమైనా ఆ సీజన్లోనే తమ సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గింది. ప్రభుత్వాాలు షూటింగులు జరపుకునేందుకు, థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకులు గతంలో మాదిరిగా థియేటర్లకి వస్తారో రారో? అనే పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts