ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నేత పెన్మత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ఓ ప్రకటన చేశారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు మరణించడంతో ఆయన కుమారుడు సూర్యనారాయణ రాజుకు పార్టీ హైకమాండ్ అవకాశం కల్పించింది.
ఎమ్మెల్యే కోటాలో ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం పెన్మత్స సూర్యనారాయణ రాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నిలక అధికారి వెల్లడించారు.