తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ విరుచుకుపడ్డారు. కోదాడలో ఇవాళ నిర్వహించిన సేవ్ ఆర్టీసీ నిరసన కార్యక్రమానికి మంద కృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ సోదర సోదరీమణులపై లాఠీ చార్జి చేయించిన ఘనుడు కేసీఆర్ అని మండిపడ్డారు.
ఆర్టీసీ ఆస్తులను బడాబాబులకు అమ్ముకోవడానికే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరిందని, అయినప్పటికీ సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన నిరంకుశ ధోరణికి నిదర్శనం అని విమర్శించారు.ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధి కల్పన చేయకపోగా, 50 వేల మంది ఉద్యోగులను తొలగించడం ద్వారా వాళ్ల కుటుంబాలను వీధిన పడేశారని ఆరోపించారు.