టీడీపీ నాయకుడు, చిత్తూర్ మాజీ ఎంపీ శివప్రసాద్ (68) కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతూ శనివారం కన్నుమూశారు. 1951 జూలై 11న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. సమాచార, సాంస్కృతిక మంత్రిగా శివప్రసాద్ పని చేశారు.
2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. పలు సినిమాల్లో నటించి, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో వినూత్న రీతిలో నిరసనలు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.
జగన్ ఫ్యాన్ స్విచ్ మోదీ వద్ద..రెగ్యులేటర్ కేసీఆర్ వద్ద: నారా లోకేశ్