telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీకి సవాల్ విరుసుతున్న .. ఆమ్ ఆద్మీ పార్టీ..

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు బీజేపీకి సవాల్ విసిరింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పోటీకి దిగే బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అంటూ ప్రశ్నించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బీజేపీ నేత విజయ్ గోయల్ కు రాసిన లేఖలో మూడు ప్రశ్నలు అడిగారు.

కేజ్రీవాల్ పై పోటీకి దిగే బీజేపీ ప్రత్యర్థి ఎవరన్నది ఓ ప్రశ్న. ఢిల్లీ ప్రజలకు బీజేపీ 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా ఇవ్వగలదా? ప్రజల నీటి బకాయిల మాఫీకి బీజేపీ అనుకూలమా? అంటూ మరో రెండు ప్రశ్నలు అడిగారు. తాను అడిగిన ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలు ప్రజలకు సమాధానం ఇవ్వాలంటూ సంజయ్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. అందుకు 24 గంటలు గడువు విధించారు. బీజేపీ స్పందించాల్సి ఉంది.

Related posts