telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఇళ్ల లో ఉన్న మనందరం డాక్టర్లకు మద్దతిద్దాం: కవిత ట్వీట్‌

kavitha trs

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు, నర్సులు ముందు వరుసలో ఉండి కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్నారని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇళ్ల లో ఉన్న మనందరం వారికి మద్దతు ఇద్దామని విజ్ఞప్తి చేస్తూ ఈ మేరకు కవిత ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌తో ఓ వైద్యురాలి పెళ్లి వాయిదా వార్తను కవిత నెటిజన్లతో పంచుకున్నారు.

కేరళకు చెందిన డాక్టర్‌ షిఫా ఎం మహ్మమద్‌(23) వృత్తిరీత్యా హౌస్‌ సర్జన్‌. ఈమె కన్నూరులోని పరియరం మెడికల్‌ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెకు దుబాయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో మార్చి 29న వివాహం జరగాల్సి ఉండే. కానీ షిఫా పని చేస్తున్న ఆస్పత్రిలో కరోనా కేసులు అధికంగా నమోదు అయ్యాయి. దీంతో రోగులకు సేవ చేయాలనే సంకల్పంతో ఆమె తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు.

Related posts