ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు, నర్సులు ముందు వరుసలో ఉండి కరోనా వైరస్పై పోరాటం చేస్తున్నారని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇళ్ల లో ఉన్న మనందరం వారికి మద్దతు ఇద్దామని విజ్ఞప్తి చేస్తూ ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో ఓ వైద్యురాలి పెళ్లి వాయిదా వార్తను కవిత నెటిజన్లతో పంచుకున్నారు.
కేరళకు చెందిన డాక్టర్ షిఫా ఎం మహ్మమద్(23) వృత్తిరీత్యా హౌస్ సర్జన్. ఈమె కన్నూరులోని పరియరం మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెకు దుబాయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో మార్చి 29న వివాహం జరగాల్సి ఉండే. కానీ షిఫా పని చేస్తున్న ఆస్పత్రిలో కరోనా కేసులు అధికంగా నమోదు అయ్యాయి. దీంతో రోగులకు సేవ చేయాలనే సంకల్పంతో ఆమె తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
మంత్రులంతా భజనపరులు..భట్టి తీవ్ర విమర్శలు!