telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనాపై పోరుకు మద్దతు..రామోజీరావు కేటీఆర్ కృతజ్ఞతలు

KTR TRS Telangana

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ లకు రూ. 10 కోట్ల చొప్పున, మొత్తం రూ. 20 కోట్లను ఆయన ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపారు. ‘కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి, ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 కోట్ల విరాళం ప్రకటించిన శ్రీ రామోజీరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.

Related posts