భారత్-చైనా మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన గొప్ప వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. చైనాతో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల మోదీ అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
భారత్, చైనాలో 1.4 బిలియన్ల చొప్పున జనాభా ఉంది. ఇరు దేశాలకు చాలా శక్తిమంతమైన సైనిక శక్తి ఉంది. ఈ వివాదం పట్ల భారత్, చైనా అసంతృప్తితో ఉన్నాయి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను భారత్, చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ బుధవారం కూడా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, అయితే ట్రంప్ నిర్ణయాన్ని ఇప్పటికే భారత్ సున్నితంగా తిరస్కరించింది. అయితే, మరోసారి ట్రంప్ అదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం.
బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్: మాజీ ఎంపీ హర్షకుమార్