telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొండపోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

kcr kondapochamma

ఈ రోజు ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ దంపతులకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి.. కేసీఆర్‌కు జ్ఞాపికను అందజేశారు. ఆలయ ఆవరణలో గోమాతను పూజించి.. పూలమాల వేసి, అరటిపండు తినిపించారు, అర్చకుల ఆశీర్వాదం సీఎం తీసుకున్నారు.

అనంతరం అక్కడి నుంచి పక్కనే ఉన్న ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు. తిరిగి 10 గంటలకు కొండపోచమ్మసాగర్‌ పంప్‌హౌజ్‌కు చేరుకుంటారు. ఇక్కడ జరిగే సుదర్శన యాగంలో చినజీయర్‌ స్వామితో కలిసి పాల్గొననున్నారు.

Related posts