telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

వేణుమాధవ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: చంద్రబాబు

chandrababu

హాస్య నటుడు వేణుమాధవ్ (40) సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మిమిక్రీ కళాకారుడిగా, హాస్యనటుడిగా వేణుమాధవ్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

వేణుమాధవ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. మహానాడులో మిమిక్రీ చేసి ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నారని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ ను, టీడీపీని ఎంతో అభిమానించేవారని చెప్పారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారని తెలిపారు. వేణుమాధవ్ మరణం టీడీపీకి కూడా తీరని లోటు అని చెప్పారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts