మాత్రలు తెచ్చుకుంటానని చెప్పి కర్నూలు ఆసుపత్రి నుంచి కరోనా రోగి బస్సెక్కి పరారైంది. కరోనా రోగి బస్సెక్కిందన్న వార్త తెలియడంతో ప్రయాణికులు భయపడిపోయారు. జిల్లాలోని ఆదోనికి చెందిన వృద్ధురాలు (65)కి కరోనా వైరస్ సోకడంతో ఆమెను బుధవారం రాత్రి కర్నూలు సర్వజన వైద్యశాలలో చేర్చారు. అయితే, గురువారం ఉదయం ఆమె మాత్రలు తెచ్చుకుని వస్తానని వార్డు సిబ్బందిని ఒప్పించి బయటకు వచ్చింది. అనంతరం ఆదోని వెళ్లే బస్సు ఎక్కేసింది.
విషయం తెలిసిన అధికారులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో అప్పటికే బయలుదేరిన బస్సును కోడుమూరులో ఆపి ఆమెను దించి తిరిగి ఆసుపత్రికి తరలించారు. తమతో పాటు కరోనా రోగి ప్రయాణించిందన్న విషయం తెలిసిన బస్సులోని 27 మంది ప్రయాణికులు భయంతో వణికిపోయారు. దీంతో అధికారులు ప్రయాణికులను బస్సు నుంచి దించి శానిటైజేషన్ కోసం బస్సును డిపోకు తరలించారు.
ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం ఈ బడ్జెట్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి