telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

భార్య బాత్రూం వీడియో వైరల్ .. గుండె నొప్పితో భర్త మృతి

కృష్ణ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్నానం చేస్తుండగా తన భార్యను వీడియో తీసారన్న మనస్తాపంతో భర్తకు గుండెపోటు వచ్చింది. మృతుడు బాపులపాడు మండలం ఏ.సీతారామపురానికి చెందిన దాసరి రమేష్(36) గా గుర్తించారు. రెండ్రోజుల క్రితం రమేష్ భార్య ఫిర్యాదు చేసినా హనుమాన్ జంక్షన్ సీఐ రమణ పట్టించుకోలేదు. నిందితుడిపై కేసు నమోదు చేశామని పేర్కొన్న వీరవల్లి పోలీసులు. రోడ్డుపై నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో నిందితుడి ఇంటివద్ద మృతుడితో ధర్నాకు దిగారు బాధిత మహిళ కుటుంబ సభ్యులు. నిందితుడు అదే గ్రామానికి చెందిన ద్రోణాదుల జయరాజ్ గా గుర్తించిన పోలీసులు..నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు వీరవల్లి పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకోకపోవడం వల్లనే రమేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆందోళన చేస్తున్నారు. తీసిన వీడియోను నిందితుడు గ్రామంలో వైరల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Related posts